Devotional

devotional

Subcategories

 లక్ష్మీ నివాసం ఎక్కడ...?ఒకసారి నారాయణుడు లక్ష్మీ దేవితో "ప్రజలలో ఎంత భక్తి పెరిగింది. అందరూ "నారాయణ” అంటూ జపిస్తున్నారు.ఆ మాటలు విని లక్ష్మీదేవి “అది మీ కోసం కాదు నా కరుణా కటాక్షం కోసమే మీమీద భక్తి పెరిగింది అని అంటుంది."అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మీ అని ఎందుకు జపించటంలేదు" అంటాడు నారాయణుడు. “అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకు” అంది. సరే అంటాడు నారాయణుడు.నారాయణుడు బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోని గ్రామాధికారి ఇంటి తలుపు తడతాడు. గ్రామాధికారి తలుపు తెరిచి, “మీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు ?” అని అడుగుతాడు.'నా పేరు లక్ష్మీపతి, మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకొంటున్నాను” అంటాడు. గ్రామాధ..
మార్గశిరం@రోజూ పండుగే!- ఈ మాస విశిష్టతేంటి?తెలుగు పంచాంగం ప్రకారం మొత్తం 12 నెలలు ఉన్నప్పటికినీ, అందులో కొన్ని మాసాలు భగవంతుని ఆరాధనకు విశేషమైనవి. పరమ పవిత్రమైన కార్తిక మాసం పూర్తి చేసుకొని, మార్గశిర మాసంలోకి అడుగు పెట్టిన సందర్భంగా, మార్గశిర మాస విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం.  లక్ష్మీ నారాయణునికి ప్రీతికరం మార్గశిరంలక్ష్మీ,నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనదిగా చెబుతారు. మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారంగా చెబుతారు. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలుగజేస్తాయని ..
సుబ్రహ్మణ్యేశ్వర షష్టి,మార్దశిర శుద్ధ షష్టి సుబ్రహ్మణ్యేశ్వర షష్టి, స్కంధ షష్టి, సుబ్బారాయుడి షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామినిపూజించడం తప్పనిసరి. నాగదోషాల నివారణకు, సంతాన లేమి, జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్యఅరాధనమే తరుణోపాయం.స్కంధ పంచమి, షష్టి రోజుల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశద్ధలతో ఆరాధిస్తే సకలసంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని స్మాంద పురాణం చెబుతున్నదజాతకంలో కుజ దోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేతసుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది.పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆ..
ఆంజనేయుడు పంచముఖుడు ఎందుకయ్యాడు ? ....శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం, రామాయణంలోనే కనిపిస్తుంది. ఆనాటి నుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది.మైరావణ వృత్తాంతం:  రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం... తెలిసిందే! సీతను చేజిక్కించుకునేందుకు రామరావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ, పోరులోకి దిగిన రావణుడు, యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పల్చబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో బెంబేలు పడిపోతాడు. వెం..
  ఈ ఆలయాన్ని శివయ్య స్వయంగా నిర్మించుకున్నాడట...!!      జంబుకేశ్వర దేవాలయంశివుడి పంచభూతలింగ క్షేత్రాల్లో, జలతత్వానికి ప్రతీక జంబుకేశ్వర క్షేత్రం. ఈ ఆలయ ప్రాకారాన్ని స్వయంగా శివుడే తన భక్తుడి కోసం, వృద్ధశిల్పి రూపంలో వచ్చి, దేవతలను కట్టడ నిర్మాణ నిపుణులుగా మార్చి, నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు, స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. దేశంలో లయకారుడు పరమశివుని ఆలయం లేని ప్రదేశం ఉండదు. దేశంలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాలు మాత్రమే కాదు.. మారుమూల ప్రాంతాల్లో కూడా శివాలయాలు ఉంటాయి. అయితే తమిళనాడులోని తిరుచిరాపల్లిలో, ప్రకృతి రమణీయ ప్రదేశంలో ఉన్న జంబుకేశ్వర దేవాలయం, అన్ని..
ఉపవాసాల ఏకాదశి  నవంబర్ 26 మంగళవారం ఉత్పన్న ఏకాదశి సందర్భంగా... కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి. ఉపవాసాలు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి. శ్రీమహావిష్ణువు శక్తి స్వరూపాలను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఉత్పన్న ఏకాదశిని కార్తీక మాసంలో విశిష్టమైన ఏకాదశిగా పేర్కొంటారు.ముర అనే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయననుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరుపెట్టాడు. సప్తమాతృకలలో ఒక స్వర..
లక్ష్మీ దేవి నివాస స్థానాలను తెలుసుకుని, ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకునే మార్గాలు ఇపుడు చూద్దాము. ఏనుగు కుంభస్థలం, గో పృష్ఠము, తామర పువ్వులు, బిల్వదళము, సువాసిని పాపటి ఈ ఐదూ లక్ష్మీ దేవి ఆవాస స్థానాలు. మనకు లక్ష్మీ దేవి అనుగ్రహం కావాలి అనుకుంటే, ఆమె ఉన్న ఈ ఐదు స్థానాలను మొదట గుర్తించాలి. ఏనుగు కుంభస్థలం మనం ఏనుగు దగ్గరకు వెళ్ళి, దాని ఎత్తుగా ఉన్న కుంభస్థానానికి పూజలు చేయడం కుదరదు. దీనికి తేలిక అయిన మార్గం గజముఖుడైన వినాయకుని పూజించడం.  ఇంట్లో ఒక వినాయక స్వామి చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేయడం చాలా తేలిక.  ఇక్కడ మన ఇష్టం వచ్చినంత సేపు లక్ష్మీ దేవి స్థానాన్ని చూస్తూ చక..
దక్షిణామూర్తి దక్షిణా మూర్తి స్వరూపం, దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడిచెవికి మకరకుండలం, ఎడమ చెవికి "తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి. మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం. తాటంకం స్త్రీల అలంకృతి, దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి, ఈ రెండు అలంకారాలు. సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే, ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి.  అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా. ఈ విషయాన్నే లలితాసహస్రంలో దక్షిణామూర్తి రూపిణీ | సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ" అని వివరిస్తోంది.ఉత్తరాభిముఖులై ఉంటారు.  ఉత్తరం జ్ఞానదశ.  ఆ దిశలో..
చిదంబర రహస్యంఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన, విశ్లేషణ అనంతరం, పాశ్చాత్య శాస్త్రవేత్తలు, ప్రపంచం యొక్క అయస్కాంత క్షేత్రం, భూమధ్య రేఖ యొక్క కేంద్రస్థానం చిదంబరంలోని నటరాజ స్వామి పెద్ద బ్రొటన వేలు లో ఉన్నది అని నిరూపించారు.మన ప్రాచీన తమిళ పండితుడు, కవి ' తిరుమూలర్ ' ఈ విషయాన్ని ఐదు వేల సంవత్సరాల క్రితమే వక్కాణించారు.  వీరు రచించిన ' తిరుమందిరం ' అనే గ్రంథం, ప్రపంచం అంతటికీ శాస్త్రీయంగా మార్గ నిర్దేశం చేసే అద్భుతమైన గ్రంథరాజం.  వీరి అధ్యయనాలను, విశ్లేషణలను అర్థం చేసుకోవడానికి, మనకు మరో వందేళ్లు కావాలి, బహుశా! ప్రత్యేకించి, చిదంబరం ఆలయం ఈ విధమైన లక్షణాలు, విశిష్టతలు కలిగి ఉంది:&..
సత్యనారాయణ స్వామి వ్రత కధల అంతరార్ధం మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో  శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది.  పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా; మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము.  ముందుగా అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, దేవతాసమూహాన్ని వారి సపరివారంగా ఆహ్వానించి, ఆవాహన చేసి ఉచితాసనాలతో సత్కరించి, వారి ఆశీస్సులను స్వీకరించి మంత్రపుష్పం సమర్పించి, అప్పుడు స్వామివారి లీలా విశేషాలను కధల రూపంగా విని తరిస్తాము. ఈ వ్రత విధానం “స్కాందపురాణం” రేవాఖండంలో వివరింపబడి వున్నది. ఇక్కడ 5 కధల సమాహారం ఎన్నో విశేషాలను మనకు తెలుపుతాయి. 1. మొదటగా ..
Showing 31 to 40 of 1006 (101 Pages)